వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి తీవ్ర అస్వస్థత! అర్ధరాత్రి ఆసుపత్రికి తరలింపు!
Sat May 24, 2025 08:38 Politics.202505243744.jpg)
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోస సమస్య తలెత్తడంతో ఆయన్ను హుటాహుటిన కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కంకిపాడు ఆస్పత్రికి వంశీ సతీమణి పంకజ శ్రీ, మాజీ మంత్రి పేర్ని నాని చేరుకున్నారు. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఎయిమ్స్ కు తరలించాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ శుక్రవారం అర్ధరాత్రి మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆయన్ను పోలీసులు వెంటనే కంకిపాడులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వంశీ సతీమణి పంకజ శ్రీ, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని వెంటనే కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు.
వంశీ ఆరోగ్యంపై పేర్ని నాని వైద్యులతో మాట్లాడారు. వంశీని ఎయిమ్స్ కు తరలించి మెరుగైన చికిత్స అందించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. ఈ మేరకు వంశీ సతీమణి పంకజ శ్రీకు ధైర్యం చెప్పారు. ఇక, వంశీకి వైద్యం నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!
ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్తో...
విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?
ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!
అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!
సైన్స్కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
ఇటీవల కూడా వంశీని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు పోలీసులు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వంశీని హుటాహుటిన వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకొచ్చారు పోలీసులు. జైలులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ విషయాన్ని న్యాయాధికారికి వంశీ వివరించారు. ఆక్సిజన్ ఎనలైజర్ పెట్టుకోవడం వల్ల ముక్కు వద్ద ఉన్న ఎముకలు నొప్పి వస్తున్నాయని చెప్పారు. తాజాగా మరోసారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళనలో ఉన్నారు.
#AndhraPravasi #VallabhaneniVamsi #FormerMLA #Gannavaram #HealthEmergency #MidnightHospitalization #VamsiHealthUpdate
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.